సీఐడీ మాజీ డీజీ పీవీ.సునీల్ కుమార్ పై సస్పెన్షన్ (Suspension) వేటు పడింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఐడీ మాజీ డీజీగా ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, అదే విధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ఫ్లానింగ్కు విరుద్ధంగా విదేశాల్లో ఉండడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ణారణకావడంతో సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయనను సస్పెండ్ చేస్తూ కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.
సునీల్ కుమార్పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసాపురం ఎంపీ, ప్రసుత్త ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈయన పై సస్పెన్షన్ వేటు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే.. సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లిన సమయంలో ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, మరికొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ, ట్రావెల్ ఫ్లాన్కు విరుద్ధంగా సునీల్ విదేశాల్లో ఉండడం, అక్కడ ప్రయాణించడం జరిగిందనే ఆరోపనలు వచ్చిప నేపథ్యంలో ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది. విచారణ జరిపిన ఆ అధికారి ఇచ్చిన నివేధిక ఆధారంగా ప్రభుత్వం సునీల్ కుమార్ను సస్పెండ్ చేసింది.