అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ, ఏప్రిల్ 2, 2025 నుండి భారత్, చైనా వంటి పలు దేశాలపై సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా దిగుమతులపై ఈ దేశాలు అధిక సుంకాలు విధిస్తున్నాయని, అందుకు ప్రతిగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇండియా అమెరికా ఉత్పత్తుల మీద 100% కి పైగా టారీఫ్స్ విధించింది. అమెరికాను సంపన్నంగా మార్చటానికి ఇవి తోడ్పడతాయి అని పేర్కొన్నాడు.
ఫిబ్రవరి 2న, చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 10% సుంకాలు విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి ప్రతిగా, చైనా కూడా అమెరికా దిగుమతులపై 10% నుండి 15% వరకు సుంకాలు విధించింది. ఇటీవల, ఫిబ్రవరి 12-13 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించి, అధ్యక్షుడు ట్రంప్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వలస, వాణిజ్య సంబంధాలు, భద్రతా పరికరాల కొనుగోలు వంటి అంశాలు చర్చించబడ్డాయి. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్, చైనా వంటి దేశాలు తమ వాణిజ్య విధానాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది.