ఢిల్లీ యూనివర్సిటీ (DU) విద్యార్థులు, విద్యార్థి సంఘం AISA నేతృత్వంలో, విజయ్నగర్ వీధుల్లో ర్యాలీ నిర్వహించి జాత్యహంకారం, ద్వేషపూరిత చర్యలు పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీని Northeast కి చెందిన వ్యక్తి మీద, అతని షాపు మీద దాడి చేసి షాపును ధ్వంసం చేయడంతో పాటు జాతి దూషణలు చేసిన ఘటనకు ప్రతిస్పందనగా నిర్వహించారు.
దాడి చేసిన వారు స్థానిక నివాసితులను, అణగారిన తరగతుల విద్యార్థులను బెదిరించే ప్రయత్నం కూడా చేశారు.
“ఇది ఒకే ఒక్క హింసాత్మక ఘటన కాదు,” అని AISA DU కార్యదర్శి అంజలి ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు. “ఇది దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు, కార్మికులు వంటి అణగారిన సముదాయాలపై వ్యవస్థాపిత ద్వేషం పెరుగుతున్న తీరుని సూచిస్తుంది. మన క్యాంపస్లు భయంగా ఉండకూడదు — అవి సురక్షితంగా, సమానత్వంతో ఉండాలి.”
నిరసనకారులు ఐక్యతకు పిలుపునిస్తూ బ్యానర్లు పట్టుకుని, మత కలహాలు, ద్వేషపూరిత హింసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు తాము నిశ్శబ్దంగా ఉండబోమని, గౌరవం కోసం హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
“మేము హెచ్చరిస్తున్నాం: ద్వేషం చెల్లదు. మతపరమైన చిచ్చును ఊరికే వదిలిపెట్టము. DU విద్యార్థులుగా మేము దేనికైనా ఎదురు నిలుస్తాము,” అని అంజలి తెలిపారు.
AISA తక్షణమే కేసు నమోదు చేయాలని, దుండగులను అరెస్ట్ చేసి, దాడి వెనుక ఉన్నవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
“విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా నిలబడతారు,” అని AISA పేర్కొంది.