కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటకు చెందిన ప్రసాద్. 11KV విద్యుత్ లైన్ను పక్కకు మార్చడానికి దుండిగల్ మునిసిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి సబ్స్టేషన్ AE సురేందర్రెడ్డిని సంప్రదించారు. జీడిమెట్ల డివిజన్లో విధులు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ AE AS.సురేందర్ రెడ్డి దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్లో పని చేస్తున్నాడు. దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బౌరంపేటకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన 11KV లైన్ షిఫ్టింగ్ కోసం ఎస్టీమేషన్ వేసేందుకు 30 వేలు రూపాయల లంచం ఆశించడంతో బాధితుడు ACB అధికారులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదుతో గురువారం 2:45 నిమిషాలకు అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్ యూనిట్-2 DSP పి.శ్రీధర్ నేతృత్వంలో D.పోచంపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో దాడులు నిర్వహించిన ACB అధికారులు బాధితుని దగ్గర నుండి 30 వేలు లంచం తీసుకొని కుడిచేతి ద్వారా ప్యాంట్ జేబులో పెట్టుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సదరు AE సురేందర్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్లో విధులు నిర్వహిస్తూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతనిని అరెస్ట్ చేసిన అధికారులు విచారణ నిమిత్తం నాంపల్లి ACB కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ACB అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం రహస్యంగా ఉంచుతామన్నారు.