టెస్లా మరియు స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఈ సంవత్సరం చివర్లో భారత్ను సందర్శించనున్నట్లు ప్రకటించారు. ఓ వాణిజ్య ఒప్పందం కోసం భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన టెలిఫోన్ సంభాషణ అనంతరం వెల్లడించారు. ఈ సంభాషణలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో సహకారం గురించి చర్చించారు .
ఈ సందర్శనతో పాటు, టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ముంబై సమీపంలోని ఓ పోర్ట్కు కొన్ని వందల కార్లను రవాణా చేయాలని టెస్లా యోచిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో టెస్లా షోరూమ్లు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం .
అలాగే, మస్క్ యొక్క స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన స్టార్లింక్ కూడా భారత్లో సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఉంది .
మస్క్ భారత పర్యటనతో టెస్లా మరియు స్టార్లింక్ వంటి సంస్థలు భారత మార్కెట్లో తమ ఉనికిని పెంచేందుకు కీలక అడుగులు వేయనున్నాయి. ఈ పర్యటన ద్వారా భారత్-అమెరికా మధ్య టెక్నాలజీ రంగంలో సహకారం మరింత బలపడే అవకాశం ఉంది.
మోడీతో సంభాషించడం ఓ గౌరవంగా భావిస్తున్నట్లు మస్క్ తెలిపారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే మస్క్ భారతదేశంలో పర్యటించాల్సి వున్నా చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అప్పుడు ఆయన మన పొరుగు దేశమైన చైనాలో పర్యటించారు.