భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె, యుద్ధం గురించి మాట్లాడుతూ, అది బాలీవుడ్ సినిమా లాంటి రొమాంటిక్ లేదా తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదని స్పష్టం చేశారు. 2025 మే 12న పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన, భారత్-పాకిస్తాన్ మధ్య సీజ్ఫైర్పై లేవనెత్తిన ప్రశ్నలను తీవ్రంగా ఖండించారు. యుద్ధం చివరి ఎంపికగా ఉండాలని, అది భారీ ధరకు దారితీస్తుందని, సోషల్ మీడియాలో యుద్ధాన్ని రొమాంటిక్గా చూపించే వారికి ఆయన సుదీర్ఘ సందేశం ఇచ్చారు. సైనికుడిగా ఆదేశాలు వస్తే యుద్ధంలో పాల్గొంటానని, కానీ అది తన మొదటి ప్రాధాన్యం కాదని, దౌత్యమే తన మొదటి ప్రాధాన్యమని ఆయన అన్నారు.
“యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి చాలా దారుణంగా వుంటుంది. షెల్లింగ్ ను చూడగానే చిన్నపిల్లలు సైతం సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తాల్సి వుంటుంది. ఇలాంటి స్థితిలో ప్రియమైన వారిని కోల్పోతే ఆ ఆవేదన తరతరాలను వెంటాడుతుంది”అని ఆయన అన్నారు.