రైతులకు హాని చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ ని ర్మాణాన్ని కొన్ని నెలలుగా అడ్డుకుంటూనే ఉన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, పాలక ప్రభుత్వ పెద్దలు హామీలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం అగిపోయిందనుకున్న పెద్ద ధన్వాడ గ్రామ ప్రజలతోపాటు 12 గ్రామాల ప్రజలకు ఆ కంపెనీ యాజమన్యం పెద్ద షాక్ ఇచ్చింది. సోమవారం అర్ధరాత్రి గ్రామస్తులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్, జేసీబీలను, కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని ఆ కంపెనీ యాజమాన్యం దింపింది.
మంగళవారం ఉదయం కొంతమంది రైతులు అటుగా వెళ్తు వాటిని గమనించి చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం చెపట్టే రాహదారిలో బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలానికి చెందిన రైతులు ముక్తకంఠంతో ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు.
నెలరోజులు నిరాహార దీక్షలు చేసి రైతులకు అండగా ప్రభుత్వం, అధికారులు నిలవాలని కోరినా పాలక ప్రభుత్వం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ హామీతో దీక్షలు విరమించామని ఇప్పుడు ఫ్యాక్టరీ యాజయాన్యం చెప్పాపెట్టాకుండా పనులు ప్రారంభించేందుకు పూనుకోవడం మంచిది కాదన్నారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీపై శాంతియుతంగానే నిరసనలు చేశామని రైతుల సహనాన్ని పరీక్షిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
గ్రామంలో కొంత మంది రైతులు పాలక ప్రభు త్వ పెద్దలతో చేతులు కలిపి ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరిస్తూ రైతుల కడుపుకొడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపైకి మంది మార్బాలం ఉందని గుండాలను దింపినా ఉద్యమాలు ఆగవని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, కాంగ్రెస్ పెద్దలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజలకు అండ గా నిలవని నాయకులకు తగి న రీతిలో బుద్ధిచెబుతామని హెచ్చరించారు.