కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ ఇప్పటికీ దాడులకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి. దీనితో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా మే 13, 2025న జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్కోట్ నగరాలకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇండిగో కూడా అదే అనుసరించింది. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ కదలికలు, ఉగ్రవాద కార్యకలాపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. విమాన సంస్థలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.