ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో, ఇరాన్ మరియు ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయుల కోసం భారత ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి. అనవసరమైన ప్రయాణాలు ఒద్దని, స్థానిక భద్రతా ప్రమాణాలను పాటించాలని, ఎంబసీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించాయి. అత్యవసర సమయంలో సురక్షిత శిబిరాలకు చేరేందుకు సిద్ధంగా ఉండాలని కోరాయి.
ఈ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, ఇరాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియాతో సహా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి లేదా దారి మళ్లించబడ్డాయి.