ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత భారత ప్రభుత్వం రక్షణ బడ్జెట్ను రూ. 50,000 కోట్లతో పెంచాలని యోచిస్తోంది. ఈ అదనపు నిధులు అనుబంధ బడ్జెట్ ద్వారా సమకూర్చబడి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రక్షణ కేటాయింపులను రూ. 7 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్తాయి.
ఈ అదనపు నిధులు పరిశోధన, అభివృద్ధి, ఆయుధాలు, సాంకేతికత, స్వదేశీ రక్షణ వ్యవస్థలైన అకాశ్ క్షిపణి వ్యవస్థ వంటి వాటి కొనుగోలుకు ఉపయోగపడతాయి. ఈ ప్రతిపాదన పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పాకిస్థాన్తో ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకోబడింది. పహల్గాం దాడికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన సైనిక చర్యలో భారత్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది.