వచ్చే నెల జూన్ మాసం నుండి రేషన్ లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించి ఉచిత బియ్యం సరఫరా కానున్నట్లు తహసీల్దార్ విజయకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో అధిక వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు మూడు నెలల కోట పంపిణీ చేసేందుకు గాను చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలవారి కోట ను లబ్ధిదారులు పొందుతున్నారని, వచ్చే నెల జూన్ మాసం నుంచి ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం సరఫరా కానున్నట్లు పేర్కొన్నారు.
కావున లబ్ధిదారులు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని తీసుకోవాలని సూచించారు. కొడంగల్ పరిధిలో మొత్తం31 రేషన్ గాను మొత్తం 12,249 కార్డులు ఉండగా 48,510 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 317.065 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా దౌలతాబాద్ మండలంలో మొత్తం రేషన్ షాపులో 30 కాగా 11843 కార్డులు 44,184 మంది లబ్ధిదామంది ఉండగా వీరికి ప్రతి నెల 297 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుంది. బొంరాస్పేట్ మండల పరిధిలో మొత్తం 29 రేషన్ షాపులు 14,303 కార్డులు ఉండగా 54,006 మంది మంది లబ్ధిదారులు వీరికి 36 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుందని తెలిపారు.