Wednesday, 3 September 2025

ప్రధాని మోదీ డిగ్రీ వ్యవహారం.. ‘సీఐసీ’ ఆదేశాలను తోసిపుచ్చిన దిల్లీ హైకోర్టు

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) దిల్లీ విశ్వవిద్యాలయానికి జారీ చేసిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఫిబ్రవరి 27, 2025న రిజర్వ్‌ చేసిన తీర్పును జస్టిస్‌ సచిన్‌ దత్తా ఆగస్టు 25, 2025న వెలువరించారు.

నీరజ్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాని మోదీ 1978లో బీఏ పూర్తి చేసిన వివరాల కోసం దరఖాస్తు చేశారు. 2016 డిసెంబరులో సీఐసీ ఆ ఏడాది బీఏ ఉత్తీర్ణుల రికార్డుల తనిఖీకి అనుమతించింది. దీనిని సవాలు చేస్తూ దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) 2017 జనవరిలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు సీఐసీ ఆదేశాలను స్టే చేసింది.

డీయూ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ తెలుసుకునే హక్కు కంటే వ్యక్తిగత గోప్యత హక్కు ఉన్నతమని, సీఐసీ ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. ప్రధాని డిగ్రీ వివరాలను కోర్టుకు చూపించడానికి డీయూ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్టీఐ కింద అపరిచితులతో పంచుకోవడానికి వ్యతిరేకమని తెలిపింది. విద్యార్థుల రికార్డులను సంరక్షణదారుగా భావించే డీయూ ఒకరి ఆసక్తి తీర్చడానికి ఆ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని వాదించింది.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు