2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో (Q1 FY26) దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. By: A.N.Kumar | 31 Aug 2025 7:00 PM Share: భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఆర్థిక వృద్ధి అన్ని అంచనాలను మించి ఉందని. జీడీపీ వృద్ధి రికార్డు స్థాయిలో 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో (Q1 FY26) దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత అంచనాల కంటే చాలా ఎక్కువ. ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ యశ్వీర్ త్యాగి మాట్లాడుతూ “భారత ఆర్థిక వ్యవస్థ చూపిన పనితీరు అంచనాలను మించిపోయింది. 7.8 శాతం వృద్ధి చాలా బలమైన సంకేతం” అని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయం, పరిశ్రమ, సేవల రంగాల బలమైన ప్రదర్శన సౌరాష్ట్ర యూనివర్శిటీకి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ జీ. పరద్వా ప్రకారం.. మంచి వర్షాకాలం కారణంగా వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వ్యవసాయం, పరిశ్రమ, సేవలు.. ఈ మూడు రంగాలు గణనీయంగా వృద్ధి సాధించడమే జీడీపీకి బలాన్నిచ్చిందని ఆయన తెలిపారు. – క్రిసిల్ నివేదిక హెచ్చరిక అయితే క్రిసిల్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉండే అవకాశం ఉంది. అమెరికా టారిఫ్ పెంపులు వంటి బాహ్య అంశాలు డౌన్సైడ్ రిస్క్గా మారవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
వినియోగదారుల డిమాండ్ పెరుగుదల ఆదాయం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయపు పన్ను రాయితీలు లాంటి కారణాలతో వినియోగదారుల డిమాండ్ గణనీయంగా పెరిగింది. గృహ వినియోగం 6 శాతం నుండి 7 శాతంకి పెరిగింది. ప్రభుత్వ ఖర్చులు కూడా పెరిగి, పెట్టుబడుల వ్యయం బలంగా నమోదైంది. అన్ని రంగాల మద్దతుతో ప్రభుత్వ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. వినియోగదారుల డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో రాబోయే త్రైమాసికాల్లో భారత ఆర్థిక వ్యవస్థ తన వేగాన్ని కొనసాగించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.