Wednesday, 3 September 2025

భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌ అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. దిల్లీలో సెమికాన్‌-ఇండియా సదస్సును ప్రారంభించిన తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ, తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధిరేటు సాధించినట్లు చెప్పారు.

‘సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరం. భారత్‌ ఆవిష్కరణలు, యువ శక్తి కూడా సదస్సులో ఉంది. ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగింది. పోటీ పెరిగిన తరుణంలోనూ భారత్‌కు ఆదరణ తగ్గలేదు. సెమీ కండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలు భారత్‌తో కలిసి వస్తున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ యాత్రలో దేశానికి కీలక భాగస్వాములున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్‌ జీడీపీ గణనీయ వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా, భారత్‌ పురోభివృద్ధి సాధిస్తోంది. ఆర్థిక మందగమనంలోనూ భారత్‌ 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది. అన్ని రంగాల్లోనూ భారత్‌ గణనీయ పురోభివృద్ధి సాధిస్తోంది. భారత్‌ త్వరితగతిన సరికొత్త శిఖరాలు అధిరోహిస్తోంది’ అని ప్రధాని మోదీ అన్నారు.

దిల్లీలో సెమీకాన్‌ ఇండియా సదస్సు-2025లో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, జితిన్‌ ప్రసాద, దిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. మేకిన్‌ ఇండియా తొలి మైక్రోప్రాసెసర్‌ చిప్‌ను ప్రధాని మోదీకి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అందించారు. విక్రమ్‌ 32 బిట్‌ ప్రాసెసర్‌, టెస్ట్‌ చిప్స్‌ను ఇస్రో సెమీకండక్టర్‌ ల్యాబ్‌ అభివృద్ధి చేసింది. వాహకనౌకల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా చిప్‌ రూపకల్పన చేసింది. సెమీకండక్టర్‌ ఎకోసిస్టమ్‌ పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు