Wednesday, 3 September 2025

భారత్‌, చైనా సంబంధాల్లో స్థిరమైన పురోగతి: ప్రధాని మోదీ

భారత్‌, చైనా మధ్య సంబంధాలు (India-China Relations) స్థిరమైన పురోగతిని సాధించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ఏడాది రష్యాలోని కజాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Jinping)తో తన భేటీ అనంతరం పరిస్థితుల్లో సానుకూల మార్పు వచ్చిందన్నారు. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ నేడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని (Modi) ఈ మేరకు ట్వీట్‌ చేశారు.
‘‘వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉంది. గతేడాది కజాన్‌లో జిన్‌పింగ్‌ (Xi Jinping)తో సమావేశమైనప్పటినుంచి.. ఇరుదేశాల సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయి. పరస్పర ప్రయోజనాలు, సున్నిత అంశాలను గౌరవించడం ద్వారా ఇది సాధ్యమైంది. చైనాలోని తియాంజిన్‌లో నిర్వహించనున్న ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు సమయంలో జిన్‌పింగ్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను. భారత్‌, చైనా (China)ల మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాలు.. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడతాయి’’ అని ప్రధాని మోదీ (Narendra Modi) ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయ్‌ – అజిత్‌ డోభాల్‌
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ తదితరులతో వాంగ్‌ యీ సమావేశమైన విషయం తెలిసిందే. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాల ఆధారంగా ఇరుదేశాల సంబంధాలు ముందుకు సాగాలని జైశంకర్‌ ఆకాంక్షించారు. చైనాలో ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1వ తేదీల్లో జరిగే ఎస్‌సీవో సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారని అజిత్‌ డొభాల్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు