ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ప్రాణాలు కోల్పోతున్న భారత విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణకు చెందిన యువకుడు అమెరికాలో కాల్పులు జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ అనే 27 ఏళ్ల యువకుడు అమెరికాలో మృతి చెందాడు. ప్రవీణ్(27) ఎంఎస్ చేయడానికి 2023లో అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మిల్వాకీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తాజాగా జరిగిన కాల్పుల్లో దుర్మరణం పాలయ్యాడు. ఒక స్టోర్లో పార్ట్టైం ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్.. మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా కొందరు దుండగులు అందులోకి ప్రవేశించారు. వారిని అడ్డగించడానికి ప్రవీణ్ ప్రయత్నించగా తుపాకులతో కాల్పులు జరిపారు. గాయపడిన ప్రవీణ్ను మిల్వాకీ పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఆ విషయం తెలిసి అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Crime Alert Crime In US Education Abroad Family Grief Gun Laws Gun Violence Indian Abroad Indian Diaspora Indian Student Killed Indian Students In US International Students Milwaukee Shooting Part-Time Job Praveen Gampa Safety Concerns Student Death Student Safety Telangana News Telangana Student Telugu Community Tragedy Tragic Incident University Of Wisconsin US News US Shooting Visa Students