బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో మరో ముగ్గురికి కూడా రూ.50 కోట్లకు పైగా భారీ జరిమానా విధించారు. ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న రన్యారావు, మరో ముగ్గురికి డీఆర్ఐ అధికారులు మంగళవారం 2,500 పేజీల జరిమానా నోటీసులు అందజేశారు. కాగా, రన్యారావు ఈ ఏడాది మార్చి 3న 14.8 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు చిక్కింది. ఆమె కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి కే రామచంద్రరావు సవతి కుమార్తె కావడం గమనార్హం.
ఇవి తప్పక చదవండి
యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు
యూనైటెడ్ కింగ్డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...
ఇంగ్లాండ్లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష
ఇంగ్లాండ్లోని స్కెల్మెర్స్డేల్లో జైలు అధికారి లెన్నీ స్కాట్ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...
యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం
యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

