Saturday, 21 March 2026

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నేనేందుకు రాజీనామా చెయ్యాలి?

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన అంశం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. ఈ ఏడాది జూన్ 4న జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో పదకొండు మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై సిద్ధరామయ్య స్పందిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు అక్కడి ముఖ్యమంత్రులు రాజీనామా చేయలేదేమని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 39 మంది చనిపోయారని గుర్తుచేస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. 2008లో హిమాచల్ ప్రదేశ్ లోని నైనా దేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగి 162 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని, అప్పుడు కూడా ఆ రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ కూడా రాజీనామా చేయలేదని గుర్తుచేశారు.

2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్ లోని జోధ్ పూర్ చాముండి దేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగి 250 మంది చనిపోయారని, అప్పుడు సీఎం పదవిలో ఉన్న బీజేపీ నేత వసుంధరా రాజే కూడా రాజీనామా చేయలేదని గుర్తుచేశారు. 2022లో ఐపీఎల్ టైటిల్ గెల్చుకున్న గుజరాత్ టైటాన్ జట్టు కరోనా వ్యాప్తి పీక్ స్టేజీలో ఉన్న సమయంలోనూ విజయోత్సవాలు జరుపుకుందని, అందులో సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబం, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కూడా పాల్గొన్నారని చెప్పారు.

ఓవైపు మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో విజయోత్సవాల పేరుతో భారీగా జనం గుమిగూడినా ఎవరూ నైతిక బాధ్యత వహించలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతటి ఘోరం జరిగినా ఎవరూ నైతిక బాధ్యత వహించరు, బీజేపీ సీఎంలు, మంత్రులు రాజీనామా చేయరు కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం రాజీనామా చేయాలని అదే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తారంటూ సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు