ఇటీవల ప్రయాగ్రాజ్లో ముగిసిన 45 రోజుల మహా కుంభమేళాలో, 130 పడవలతో సేవలు అందించిన ఒక కుటుంబం (కమ్యూనిటీ) సుమారు రూ.30 కోట్లు సంపాదించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే ఈ విషయం పడవలు నడిపే వారితో మాట్లాడినప్పుడు ఒక కుటుంబం కాదు 100 కుటుంబాల కమ్యూనిటీ అని సుమారు 130 బోట్స్ ఉన్నాయి అని చెప్పారు. గతంలో యాభైవేల నుండి లక్ష సంపాదిస్తే కుంభమేళా సమయంలో అయిదు లక్షల నుండి ఎనమిది లక్షల వరకు సంపాదించినట్లు చెప్పారు. ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగిసింది. ఈ సమయంలో సుమారు 66 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. మొత్తం రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి, హోటల్ పరిశ్రమకు రూ.40 వేల కోట్లు, ఆహారం మరియు ఇతర నిత్యావసరాల రంగానికి రూ.33 వేల కోట్లు, రవాణా రంగానికి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది.