Tuesday, 17 March 2026

మనోజ్ జరాంగే పాటిల్ డిమాండ్లకు మహారాష్ట్ర సర్కార్​ ఆమోదం

ఐదు రోజుల నిరాహార దీక్ష తర్వాత మరాఠా కోటా ఉద్యమానికి విజయం వరించిందని మనోజ్ జరాంగే పాటిల్ ప్రకటించారు. అనంతరం నిరాహార దీక్షను ముగించిన ఆయన, మరాఠాలు గెలిచారని ఆనందం వ్యక్తంచేశారు. మరాఠాలు, కున్బీలు ఒకే కమ్యూనిటీకి చెందినవారని గుర్తిస్తూ జీఆర్​ జారీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి 2 నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు.

మరాఠా కోటా కోసం జరిగిన ఆందోళనల్లో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు వారంలోగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని జరాంగే చెప్పారు. మరాఠా ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన మంత్రుల బృందం హామీ ఇచ్చిందని వెల్లడించారు.

మరోవైపు ఆజాద్ మైదాన్​ను ఖాళీ చేసేందుకు జరాంగేకు బాంబే హైకోర్టు రేపు ఉదయం వరకు సమయం ఇచ్చింది. రేపటిలోగా ఆజాద్ మైదాన్ ను ఖాళీ చేయించకపోతే, చట్టం గౌరవాన్ని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. ఇందుకోసం కోర్టే ఉత్తర్వులు జారీ చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జరాంగే వద్దకు మహారాష్ట్ర మంత్రుల బృందం వెళ్లి చర్చలు జరిపింది. చాలా వరకు డిమాండ్లను అంగీకరించింది. దీనితో మరాఠా వర్గానికి 10 శాతం కోటా కావాలని​ చేస్తున్న నిరాహార దీక్షను జారంగే విరమించారు. ఈ విజయంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

హైదరాబాద్ గెజిట్​ అమలుకు సర్కార్ ఆమోదం
మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌ నేతృత్వంలోని సబ్‌ కమిటీ మంగళవారం, మరాఠా కోటా ఉద్యమం చేస్తున్న మనోజ్‌ జరాంగేను కలిసింది. ‘హైదరాబాద్‌ గెజిట్‌’ అమలుకు సర్కార్​ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. మరాఠా నిరసనకారులపై గతంలో దాఖలు చేసిన కేసులను ఈ సెప్టెంబర్ చివరికల్లా ఉపసంహరించుకుంటామని పేర్కొంది. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని స్పష్టం చేసింది. విద్యార్హతల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు చెప్పింది. అయితే కున్బీలు, మరాఠాలు ఒకే వర్గమని ఉత్తర్వులు జారీ చేసేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌ చెప్పారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు