Wednesday, 3 September 2025

మనోజ్ జరాంగే పాటిల్ డిమాండ్లకు మహారాష్ట్ర సర్కార్​ ఆమోదం

ఐదు రోజుల నిరాహార దీక్ష తర్వాత మరాఠా కోటా ఉద్యమానికి విజయం వరించిందని మనోజ్ జరాంగే పాటిల్ ప్రకటించారు. అనంతరం నిరాహార దీక్షను ముగించిన ఆయన, మరాఠాలు గెలిచారని ఆనందం వ్యక్తంచేశారు. మరాఠాలు, కున్బీలు ఒకే కమ్యూనిటీకి చెందినవారని గుర్తిస్తూ జీఆర్​ జారీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి 2 నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు.

మరాఠా కోటా కోసం జరిగిన ఆందోళనల్లో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు వారంలోగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని జరాంగే చెప్పారు. మరాఠా ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన మంత్రుల బృందం హామీ ఇచ్చిందని వెల్లడించారు.

మరోవైపు ఆజాద్ మైదాన్​ను ఖాళీ చేసేందుకు జరాంగేకు బాంబే హైకోర్టు రేపు ఉదయం వరకు సమయం ఇచ్చింది. రేపటిలోగా ఆజాద్ మైదాన్ ను ఖాళీ చేయించకపోతే, చట్టం గౌరవాన్ని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. ఇందుకోసం కోర్టే ఉత్తర్వులు జారీ చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జరాంగే వద్దకు మహారాష్ట్ర మంత్రుల బృందం వెళ్లి చర్చలు జరిపింది. చాలా వరకు డిమాండ్లను అంగీకరించింది. దీనితో మరాఠా వర్గానికి 10 శాతం కోటా కావాలని​ చేస్తున్న నిరాహార దీక్షను జారంగే విరమించారు. ఈ విజయంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

హైదరాబాద్ గెజిట్​ అమలుకు సర్కార్ ఆమోదం
మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌ నేతృత్వంలోని సబ్‌ కమిటీ మంగళవారం, మరాఠా కోటా ఉద్యమం చేస్తున్న మనోజ్‌ జరాంగేను కలిసింది. ‘హైదరాబాద్‌ గెజిట్‌’ అమలుకు సర్కార్​ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. మరాఠా నిరసనకారులపై గతంలో దాఖలు చేసిన కేసులను ఈ సెప్టెంబర్ చివరికల్లా ఉపసంహరించుకుంటామని పేర్కొంది. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని స్పష్టం చేసింది. విద్యార్హతల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు చెప్పింది. అయితే కున్బీలు, మరాఠాలు ఒకే వర్గమని ఉత్తర్వులు జారీ చేసేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌ చెప్పారు.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు