చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఈ రోజు ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ మొదటీ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 16 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు వున్నారు. ప్రమాద సమయంలొ భవనంలో వున్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. వారిని ఉస్మానియా, మలక్ పేట యశోద, డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి అగ్నిమాపక, డీఅరెఫ్, జిహెచెంసి, పోలీస్ సిబ్బంద్ చేరుకొని సహాయక అచర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకుపోయిన మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవటంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బంది పడ్డారు.
అగ్నిప్రమాదం బాధాకరం: సీఎం రేవంత్ రెడ్డి
అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 16మంది మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.