ఎక్కడ కన్ఫ్యూషన్ వచ్చింది ? ఎలా మీడియా హౌసెస్ ఫాక్ట్ చెక్ చేస్స్కోకుండా న్యూస్ ప్రచురించాయి ? అసలు నిజాలు ఏమిటి ?
సినీ తారల వార్తలు ఎప్పుడూ ఎక్కువ ప్రజాదరణ పొందడం, త్వరగా వైరల్ అవడం ఎక్కువ Likes & ఎక్కువ comments రావడం కామన్ ..
అయితే, వాటిని ఫాక్ట్స్ చెక్ చేయకుండా పోస్ట్ చేయడం సోషల్ మీడియా వంటి ప్లాట్ఫారమ్లలో ఎక్స్పెక్ట్ చేయదగిన విషయమే కావొచ్చు కానీ, మెయిన్స్ట్రీమ్ మీడియా అలా చేయడం కరెక్ట్ కాదు.
విషయం సమగ్రంగా పరిశీలించకుండా, వాస్తవాలను నిర్ధారించకుండా ప్రచారం చేయడం ఈ మధ్య కాలంలో ఒక తీవ్రమైన సమస్యగా మారింది.
తాజాగా, మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది. యూకే పార్లమెంట్/హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ UK Government స్వయంగా బహుకరిస్తున్నదని మీడియాలో భారీ స్థాయిలో వార్తలు వచ్చాయి.
కానీ, అసలు వాస్తవం అందుకు భిన్నంగా ఉంది.
“సత్యాసత్యాలు ఏమిటి?”?
ఈ అవార్డును యూకే పార్లమెంట్ ఇవ్వడం లేదు. Bridge India అనే Non-Profit Organisation ( Charity) ఈ అవార్డును అందజేస్తోంది.
Bridge India ఒక Non Profit Organization. , దీని Founder Pratik Dattani.
ఈ సంస్థ UK Parliament లోని House of Commons లో వున్న one of the venues లో చిరంజీవిని సత్కరించనుంది.
ఈకార్యక్రమానికి Stockport Labour Party MP Navendu Mishra ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఎక్కడ తప్పుదొర్లింది?
ఈ కార్యక్రమం UK Government లేదా UK Parliament అధికారికంగా అందిస్తున్న అవార్డు కాదు కానీ ఇది UK Parliament భవనంలో జరుగుతున్నందున, అలాగే ఒక బ్రిటిష్ MP హాజరవుతున్నందున, దీనిని UK ఇస్తున్న Award అని అందరూ అనుకున్నట్లున్నారు
ఎవరైనా అనుకోవచ్చు కాని ప్రధాన మీడియా అనుకోకూడదు, నిజానిజాలు Bridge India (Charity Organisation ) తో కానీ, ఇక్కడ వున్న తెలుగు అడ్మిన్స్ తో కానీ వెరిఫై చేసుకునుండొచ్చు కానీ చేసుకోకుండా ప్రచురించారు.
ఈనాడు లాంటి మీడియా ప్రచురించాక ఇంక అందరూ అదే ఫాలో అయ్యారేమో తెలియదు, హిందుస్థాన్ కూడా అదే విధంగా తప్పుగా ప్రచురించింది. Government అవార్డు అని మీడియాలో తప్పుగా ప్రచారం జరిగింది .
ప్రధాన మీడియా సైతం పట్టిన తప్పుదోవ ;
ఆశ్చర్యకరం కానీ నిజం – Hindustan Times, Eenadu, TV9, TV5, Sakshi, ZEE News వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా నిజాన్ని సరిగా తెలుసుకోకుండా “UK Parliament చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అందజేస్తోంది!” అంటూ వార్తలు ప్రచారం చేశాయి.
Bridge India ఏమిటి?
Bridge India ఒక London-based Non-Profit Organisation, ఇది పబ్లిక్ పాలసీ, సోషల్ ఇష్యూస్, ఇండియన్ డయాస్పోరా లాంటి అంశాలపై పని చేస్తుంది. ఈ నెల 15th to 19th March వరకు Bridge India నిర్వహించిన Events లో భాగంగా 17th March 2025 న Kancha Ilaiah తో ఒక డిబేట్ & డిస్కషన్ జరగగా, 19th March 2025 న జరుగుతున్న multiple schedules events లో చిరంజీవి Felicitation కూడా ఒకటి .
Bridge India లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ANR Awards, Ramanaidu Awards లాంటి ప్రైవేట్ organizations self interest తో ప్రజల మన్నన పొందిన వాళ్లకి ఇస్తూ వస్తున్నటువంటి Recognitions లాంటిదే.
ఇది UK Government సంబంధం లేని అవార్డు. అయితే, ఇది UK Parliament భవనంలో జరుగుతుండటం, ఒక MP హాజరవడం వలన గందరగోళం ఏర్పడింది.
ఒక Non-Profit Organisation అందజేస్తున్న అవార్డును UK Government Award అని ప్రచారం చేయడం మీడియా పెద్ద తప్పిదం. ఇది వాస్తవాలను వక్రీకరించడం మాత్రమే కాకుండా, మీడియా నైపుణ్యాన్ని ప్రశ్నించదగిన విషయం. ప్రజలు కూడా గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలి.
మీడియా అత్యుత్సాహం
చిరంజీవి గారు ఎక్కడా దీన్ని UK GOVT/Parliament ఇస్తున్న అవార్డుగా చెప్పలేదు ఇదంతా మీడియా అత్యుత్సాఅహం మాత్రమే.
ప్రధాన మీడియా సంస్థలు తమ బాధ్యతను మరింత నిబద్ధతతో నిర్వహించాలి.
ఇది కేవలం తప్పుడు సమాచారం (Misinformation) మాత్రమే కాకుండా, తప్పుదోవ పట్టించే, నిజాలను సరిచూసుకోని (Non-Fact Checked) ప్రచారం కూడా.
త్వరగా వార్తను ప్రసారం చేయాలనే తపన కారణంగా తప్పుదోవ పట్టింది.
వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, ప్రత్యర్థుల కంటే ముందుగా న్యూస్ పబ్లిష్ చేయాలనే హడావుడి వల్లే, ఇటువంటి తప్పుడు సమాచారం పెద్ద స్థాయిలో వ్యాప్తి చెందింది.
మీడియా ఇలాంటి విషయాల్లో నిజ నిర్ధారణ (Fact-Checking) చేయకుండా ముందుకువెళ్లడం మీడియానైపుణ్యాన్ని శంకించే పరిస్థితిని తీసుకొస్తోంది .
ప్రతి మీడియా సంస్థ తమకితాము ప్రశ్నించుకోవాల్సిన బాధ్యతను కూడా తీసుకొస్తోంది.