గత YCP ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు, తయారీ లో అవకతవకలు జరిగాయని, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో రాజంపేట MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) ఆరోపించింది. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని డిస్టిలరీలు నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేసి, ప్రభుత్వ ఛానెళ్ల ద్వారా అధిక ధరలకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, మద్యం కోటాలను కొన్ని డిస్టిలరీలకు పెంచడంలో, మరికొన్నింటిని తగ్గించడంలో ఆయన ప్రభావం చూపినట్లు సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ కోణంలో CID అధికారులు దర్యాప్తు చేస్తుండగా, ఆయన గత నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున వాదిస్తూ, తాను MPగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఇది జరిగిన మరుసటి రోజు YCP MP మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అయింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు MP CID బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించడంతో మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.