ఇదొక అరుదైన కేస్. ఓ హై ప్రొఫైల్ కేస్ కూడా. ఒక హైకోర్ట్ మహిళా జస్టీస్ తాను ఏ తప్పు చేయలేదని నిరూపించబడటానికి 16 సంవత్సరాల పాటు ఎదురుచూసిన కేస్.
వివరాల్లోకి వెళితే హర్యాన హైకోర్ట్ జస్టీస్ గా పనిచేసిన నిర్మలా యాదవ్ భారీగా అక్రమాలకి పాల్పడ్డారని CBI కేస్ నమోదు చేసింది. ఈ కేస్ 16 సంవత్సరాల పాటు CBI ప్రత్యేక కోర్టులో సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. తాజాగా CBI కోర్టు ఆమె ఏ నేరానికి పాల్పడలేదని తీర్పు ఇచ్చింది. ఆమెని నిర్దోషిగా ప్రకటించింది. 2008లో నమోదైన ఈ కేస్ ఇన్నాళ్లకు పూర్తైంది. తీర్పు వచ్చిన అనంతరం నిర్మలా యాదవ్ తనకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వుందని, ఓపిక పట్టినందుకు ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.