ఉస్మానియా యూనివర్సిటీ (OU) లోని విద్యార్థులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు, ఆయన OU Chancellor గా వ్యవహరిస్తుండటంతో, ఒక e-mail రాశారు. అందులో PG College of Law కు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడిని ప్రిన్సిపల్గా నియమించాలంటూ డిమాండ్ చేశారు.
ప్రస్తుత ప్రిన్సిపల్ డా. గుమ్మడి అనురాధ బాధ్యతలు చేపట్టిన తరువాత, “కళాశాలలో విద్యా ప్రమాణాలు దిగజారాయి, మేము న్యాయమైన ప్రశ్నలు లేవనెత్తినందుకు మమ్మల్ని Target చేస్తున్నారు” అంటూ విద్యార్థులు ఆరోపించారు.
విద్యార్థుల ముఖ్యమైన డిమాండ్స్:
•అర్హత కలిగిన, సీనియర్ మరియు ప్రతిష్టాత్మకమైన విద్యా, నైతిక రికార్డుతో కూడిన ప్రొఫెసర్ను OU Basheerbagh లోని PG College of Law కు తక్షణమే ప్రిన్సిపల్గా నియమించాలి.
•ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ డా. గుమ్మడి అనురాధ ప్రొఫెషనల్ ప్రవర్తన మరియు అనైతిక పరిపాలనా విధానాలపై స్వతంత్రంగా ఉన్నత స్థాయి విచారణ జరపాలి.
•విద్యార్థుల హక్కులను కాపాడాలి – అందులో విద్యా ప్రవేశ హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, కళాశాల management వేధింపులు మరియు అధికార దుర్వినియోగం నుండి రక్షణ కల్పించాలి.
ఇంకా, విద్యార్థులు తమ లేఖను physical copy కూడా పోస్టు ద్వారా గవర్నర్ కు పంపనున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ప్రిన్సిపల్ డా. గుమ్మడి అనురాధ మాజీ ఇల్లందు MLA గుమ్మడి నర్సయ్య గారి కుమార్తె అనే విషయం అందరికి తెలిసిందే.