యుద్దాన్ని ఆపడం చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే యుద్దానికి హైప్ క్రియేట్ చేసి మొత్తం ఎదో చేసేస్తాం అనే ఒక బిల్డప్ తీసుకొచ్చారు కాబట్టి. అందరూ ఎదో జరుగుతుంది అని నిన్నటి వరకు ఊహించుకున్నారు. కానీ సడన్ గా కాల్పుల విరమణ అనేసరికి కోపం రావడం జరిగింది, విసుగు ధ్వనిస్తోంది.
రాజకీయ పార్టీలు లాభం కోసం జనంలో ఒక విధమైన భావోద్వేగం తీసుకొస్తాయి. దాని తరువాతి పర్యవసానం గురించి ఆలోచించవు. వాస్తవానికి ప్రభుత్వం యుద్ధం చేయాలి అనుకోలేదు. కొన్ని దాడులు మాత్రమే చేయాలి అనుకుని చేసింది. అందులో సక్సెస్ అయ్యాం అని చెప్పింది అంతవరకు ప్రభుత్వ ఆలోచన.
కానీ పాకిస్తాన్ నాలుగు చోట్ల కాల్పులు ఇంకేదో చేసింది. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు కూడా మేము ఎదో చేశాం అని చెప్పుకోవాలి అందుకే ఆ ప్రయత్నాలు చేసింది అంతే తప్ప పాకిస్తాన్ యుద్ధం కోరుకోవడం లేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం పాకిస్తాన్ కాల్పుల విరమణ కొరకు అడిగింది కాబట్టి మేము ఒప్పుకున్నాం అని చెబుతోంది. ఇప్పుడేమైంది అంటే ఇద్దరికీ విన్ విన్ సిట్యుయేషన్ గా మారిపోయింది.
అదే చాలామంది భారతీయులకు నచ్చడం లేదు. పాకిస్తాన్ బలహీనంగా ఉంది pok స్వాధీనం చేసుకోవాలి పాకిస్తాన్ లేకుండా చేయాలి మన దెబ్బ ఏంటో చూపించాలి అంటూ రకరకాలుగా గత మూడు నాలుగు రోజులుగా చర్చించుకుంటున్నారు, అందుకే డిస్సపాయింట్ అయ్యారు. పూర్తిగా యుద్ధం చేసి ఆక్రమించుకునే పరిస్థితులు ఏవో చిన్న చిన్న జనాభా కలిగిన దేశాలు అయితే తప్ప పెద్ద దేశాలను ఓడించడం ఆక్రమించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఈ సమస్య ఆ ఒక్క దేశానిది కాదు ఆ దేశం తో లింక్ అయిన చాల దేశాలకు స్టేక్స్ ఉంటాయి. పూర్తి యుద్దానికి వెళ్తే వాళ్ళు రంగంలోకి దిగుతారు.
మనమేమైనా ధనిక దేశమా? మనమేమైనా 90% ఎగుమతులు 10% దిగుమతులు చేసుకుంటున్న దేశమా, మనం పూర్తి యుద్ధం చేయటానికి. యుద్ధం అనేది మొదలయితే ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా దిగజారుతాయి, ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. అందుకే పాకిస్తాన్ అడిగిన వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకుంది.
ఈ విషయాలు మనకు తెలియవు కదా. మనం యుద్దానికి బాగా సిద్ధం అయి ఉన్నాం కదా, అందుకే యుద్ధం యుద్ధం అంటూ మాట్లాడుతూ అనవసరంగా యుద్ధం ఆపారు అని మాట్లాడుతున్నాం. యుద్ధం అనేది లక్షల కోట్ల రూపాయలను గంగలో పోసినట్లే. యుద్ధంలో గెలిచినా ఒక్కరూపాయి లాభం మనకు రాదు. యుద్ధం వలన దేశంలో పేదరికం మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి ఆవేశాన్ని ఆపేసి ఎవరి పనులు వారు చేసుకోవడం ఉత్తమం.