గోవాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ INS Vikrant ను సందర్శించి, నౌకాదళ సిబ్బందితో ముచ్చటించారు. 1971లో పాకిస్థాన్ రెండు ముక్కలైందని, ఒకవేళ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం జోక్యం చేసుకుంటే దాయాది దేశం ఇప్పటికే నాలుగు ముక్కలయ్యేదని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్ మరోసారి దాడికి తెగబడితే, ఈసారి భారత నౌకాదళం యుద్ధంలో పాల్గొంటుందని, ఇది కేవలం ‘Warm up’ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాదు, ‘ఉగ్రవాదుల హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను భారత్కు అప్పగించాలి. పాకిస్థాన్ తరచూ వార్తల కోసం సిద్ధంగా ఉన్నాం’ అంటూ ప్రకటిస్తున్నప్పటికీ, ఇది కేవలం మాటలకే పరిమితమవుతుంది నిజమైన శాంతికోసం ఉగ్రవాద నిర్మూలనపై పాక్ సంకల్పం చూపించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
INS విక్రాంత్ ఆధ్వర్యంలోని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (CBG), MIG-29K యుద్ధ విమానాలు, ఎయిర్బోర్న్ హెలికాప్టర్లతో కలసి నౌకాదళం సముద్రంపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్ వాయుసేన మక్రాన్ తీరం నుంచి సముద్రంలోకి రాకుండా అడ్డుకోవడంలో నౌకాదళం విజయవంతమైంది. నౌకాదళ యుద్ధనౌకలు దక్షిణ, పశ్చిమ తీరాల్లో క్షిపణి ప్రయోగాలు చేసి శక్తివంతమైన సందేశాన్ని పంపాయి.
‘మీరు యుద్ధంలోకి రాకుండానే మీ సంసిద్ధతతో శత్రువుని భయపెట్టారు. మీ శక్తి చూస్తేనే వారు భయపంతో వెనక్కిపోతారు’ అని INS విక్రాంత్ నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. 1971 బంగ్తాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్థాన్ను భారత నౌకాదళం చావుదెబ్బ కొట్టింది. దాయాదికి ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన కరాచీ పోర్టుపై దాడిచేయడంతో పాక్ యుద్ధంలో లొంగిపోయింది. నేవీ ఆపరేషన్ ట్రైడెంట్తో డిసెంబరు 4 కరాచీ పోర్టును స్వాధీనం చేసుకుంది. అందుకే ఏటా డిసెంబరు 4న భారత నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటుంది