లక్షన్నర రూపాయల విలువ చేసే రెండు క్వింటాళ్ల కుళ్లిపోయిన మాంసాన్ని భద్రపరిచి, విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డిసిపి, కమిషనర్ టాస్క్ ఫోర్స్ అందె శ్రీనివాసరావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ కి చెందిన కమిషనర్స్, టాస్క్ ఫోర్స్ బృందం, చార్మినార్ జోన్ వెటర్నరీ ఆఫీసర్ తో కలిసి సంయుక్తంగా డబీర్ పురాలోని ఒక ఇంటి మీద దాడిచేసి లక్షన్నర రూపాయిల విలువైన గొర్రె, మేకలకు చెందిన రెండు క్వింటాళ్ల మాంసాన్ని స్వాధీనం చేసుకొని మొహమద్ మిస్బాహుద్దీన్ ని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాంసంలో కుళ్లిన గొర్రె, మేకలకు చెందిన కాళ్లు, తలకాయ, నాలుక, మెదడు భాగాలున్నాయి. ఈ దాడి టాస్క్ ఫోర్స్ కి చెందిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదాబాబు ఆధ్వర్యంలో జరిగిందని ఎక్స్ లో చేసిన ప్రకటన ద్వారా తెలిపారు.