Moscow పశ్చిమ దేశాలపై హైబ్రిడ్ యుద్ధంలో భాగంగా Lithuaniaలో దాడికి ఉక్రేనియన్ శరణార్థిని నియమించుకున్నారని నివేదికలు చెబుతున్నాయి.
పశ్చిమ దేశాలపై తన “హైబ్రిడ్ యుద్ధం”లో భాగంగా ఐకియా స్టోర్పై బాంబు దాడి చేయడానికి రష్యా Ukrenian యువకుడికి చెల్లించిందని గురువారం US మీడియా నివేదించింది. లిథువేనియా రాజధాని Vilniusలోని Ikea స్టోర్పై దాడి చేయడానికి రష్యన్ గూఢచారులు 17 ఏళ్ల టీనేజర్ కి $11,000 (£8,000) నగదు, BMW కారును ఆఫర్ చేసినట్లు Newyork Times రిపోర్ట్ చేసింది.
జేమ్స్ బాండ్ ప్రేరేపిత అలియాస్ Q కింద ఎన్క్రిప్టెడ్ చైనీస్ మెసెంజర్ యాప్ జెంగి ద్వారా ఏజెంట్లు అతనితో కమ్యూనికేట్ చేశారని లిథువేనియన్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఫిబ్రవరి 2022 దండయాత్ర తర్వాత ఉక్రెయిన్ నుండి పారిపోయి European Unionలో శరణార్థిగా పునరావాసం పొందిన యువకుడు మే 2024లో ఈ దాడిని నిర్వహించాడని ఆరోపించబడింది.
“రష్యాకు, వయస్సు, లింగం మరియు భావజాలం పట్టింపు లేదు… Ukreyinకు మద్దతు ఇవ్వకుండా మమ్మల్ని బలవంతం చేయడం, నిరోధించడమే వారి లక్ష్యం” అని Lithuania అధ్యక్షుడి జాతీయ భద్రతా సలహాదారు Marius Sennulevisius Newyork Times తో అన్నారు.
యువకుడిని అరెస్టు చేసిన Lithuanian అధికారులు దాడికి సంబంధించిన చాలా వివరాలను సేకరించగలిగామని చెప్పారు. ఆ యువకుడు ఐకియా స్టోర్లోని బెడ్డింగ్ విభాగంలో oక పరికరాన్ని అమర్చాడని, మొత్తం భవనాన్ని తగలబెట్టాలని ఉద్దేశించాడని, కానీ చివరికి అలా చేయడంలో విఫలమయ్యాడని వారు ఆరోపిస్తున్నారు.
Lithuaniaకు చెందిన పలు వర్గాలు తెలిపిన న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఆ యువకుడు పాడైపోయిన BMW కారును అందుకున్నట్లు తెలుస్తోంది, కానీ అతనికి వాగ్దానం చేసిన నగదు అందలేదు.
ఐకియా దాడికి ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆ యువకుడు తూర్పు నగరమైన సియౌలియాలో NATO స్థావరాన్ని నిర్వహిస్తున్న ఐకియా స్టోర్ను కూడా స్కౌట్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
గత సంవత్సరం, లిథువేనియన్ పోలీసులు 82 ఏళ్ల రిటైర్డ్ వ్యక్తిని అతని ఇంట్లో “స్పై గేర్” కనుగొన్న తర్వాత GRU (రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్) ఏజెంట్ అనే అనుమానంతో Siyoulia లో అరెస్టు చేశారు,
Edwardas Manovas కి గురువారం GRU తరపున గూఢచర్యం చేసినందుకు ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారని లిథువేనియా పబ్లిక్ బ్రాడ్కాస్టర్ తెలిపింది.