దాదాపు పదకొండేళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ IPL ఫైనల్లో అడుగుపెట్టింది. IPL 2025 సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబయి ఇండియన్సున్ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్లో అజేయంగా నిలిచి తన జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను Shreyas Iyer తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. 2020 సీజన్లో దిల్లీ, 2024 సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్న టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు. శ్రేయస్ ను మెగా వేలంలో రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
బ్యాటింగ్ చేసేటప్పుడు కామ్ గా ఉండటం వెనుక కారణం ఏమీలేదు. ఇలాంటి భారీ మ్యాచులంటే నాకు చాలా ఇష్టం. నా సహచరులకు ఒకటే మాట చెబుతా.. ఇలాంటప్పుడు నిశ్శబ్దంగా కృషి చేస్తే ఫలితం అదే వస్తుంది. ఈ మ్యాచ్ ఫలితం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 200+ లక్ష్య ఛేదనలో ప్రతి ఒక్కరూ అలర్ట్ ఉండాలి. తొలి బంతి నుంచే విజయం సాధించేందుకు ప్రయత్నించాలి. మేం అదే చేశాం. తొలుత నేను క్రీజ్లో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నా. ఆ సమయంలో ఇతర బ్యాటర్లు ముందుకొచ్చి పరుగులు రాబట్టారు. మేం తొలి క్వాలిఫయర్లో ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురైనప్పటికీ.. అదంతా అక్కడితోనే మరిచిపోయాం. కేవలం ఒక్క మ్యాచ్లోనే మా జట్టు ఏంటనేది నిర్వచించలేం అని శ్రేయస్ వెల్లడించాడు.