Saturday, 21 March 2026

ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పాల్గొననున్న పాకిస్తాన్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ జట్టు పాల్గొననుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇటీవల 15 మంది సభ్యుల స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ స్క్వాడ్‌లో బాబర్ అజామ్, షహీన్ అఫ్రిదీ, షదాబ్ ఖాన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కొందరు కొత్త ఆటగాళ్లు (ఖవాజా నఫాయ్, ఉస్మాన్ తారిక్ వంటివారు మెగా ఈవెంట్‌లో మొదటిసారి అవకాశం పొందారు. టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారతదేశం, శ్రీలంకలలో జరగనుంది.

పాకిస్తాన్ జట్టు గ్రూప్ Aలో ఉంది. ఇందులో భారతదేశం, నమీబియా, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) ఉన్నాయి. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సహా పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో (ముఖ్యంగా కొలంబోలో) జరగనున్నాయి. ఇది 2024-2027 ICC ఈవెంట్స్ సైకిల్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య ఒప్పందం ప్రకారం న్యూట్రల్ వేదికల్లో ఆడాలనే నిబంధన కారణంగా జరుగుతోంది.

ఇటీవల బంగ్లాదేశ్ టీమ్ టోర్నమెంట్ నుంచి తొలగించబడిన విషయంపై PCB కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రభుత్వంతో చర్చలు జరిపి, పాల్గొనడం లేదా బాయ్‌కాట్ చేయడంపై నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు టీం ప్రకటించడంతో ఈ మెగా ఈవెంట్ లో పాకిస్తాన్ ఆడుతున్నట్లు నిర్ధారణ అయింది. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ బలమైన పోటీదారుగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు