Wednesday, 3 September 2025

భారత్​- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్​కు కేంద్రం అంగీకారం

పాకిస్థాన్​తో జరిగే ఎలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనకూడదని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ద్వైపాక్షిక పోటీ​లో భాగంగా పాకిస్థాన్​ జట్టు భారత్​కు వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అయితే అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్​తో తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే ఆసియా కప్​లో భారత్​ను ఆడకుండా అడ్డుకోబోమని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు భారత్​- పాకిస్థాన్​ అంతర్జాతీయ మ్యాచ్​లపై కొత్త విధానాన్ని ప్రటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించింది. అయితే, ఒలింపిక్​ ఛార్టర్​ ప్రకారం అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్​తో తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇలాంటి టోర్నమెంట్​లో భాగంగా పాకిస్థాన్​లో పర్యటించేందుకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించగా, అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సంబంధాలు తెంచుకోవాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో ఇటీవలే జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో కూడా భారత్- పాకిస్థాన్​ మ్యాచ్‌ను జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్‌లో ఏమి జరుగుతుందన్న దానిపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, తాజాగా కేంద్రం అంగీకారం తెలపడంతో భారత్​- పాక్ మ్యాచ్​ జరగనుంది. ఈ టోర్నీలో గ్రూప్ దశలో భారత్- పాకిస్థాన్ రెండు సార్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 14, 21 తేదీ (గ్రూప్, సూపర్ 4 దశ)ల్లో భారత్-పాక్ మ్యాచ్ ఆడనుంది. అంతేకాకుండా నాకౌట్ దశలోనూ మరోసారి ఇరుజట్లు పోటీపడే ఛాన్స్​ కూడా ఉంది. ఫలితంగా ఇరు జట్లు మూడు సార్లు ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్​లు అన్నింటికీ దుబాయ్ స్టేడియం వేదిక కానుంది.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు