Thursday, 15 January 2026

భారత్​- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్​కు కేంద్రం అంగీకారం

పాకిస్థాన్​తో జరిగే ఎలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనకూడదని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ద్వైపాక్షిక పోటీ​లో భాగంగా పాకిస్థాన్​ జట్టు భారత్​కు వచ్చేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అయితే అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్​తో తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే ఆసియా కప్​లో భారత్​ను ఆడకుండా అడ్డుకోబోమని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు భారత్​- పాకిస్థాన్​ అంతర్జాతీయ మ్యాచ్​లపై కొత్త విధానాన్ని ప్రటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించింది. అయితే, ఒలింపిక్​ ఛార్టర్​ ప్రకారం అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్​తో తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇలాంటి టోర్నమెంట్​లో భాగంగా పాకిస్థాన్​లో పర్యటించేందుకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించగా, అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సంబంధాలు తెంచుకోవాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో ఇటీవలే జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో కూడా భారత్- పాకిస్థాన్​ మ్యాచ్‌ను జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్‌లో ఏమి జరుగుతుందన్న దానిపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, తాజాగా కేంద్రం అంగీకారం తెలపడంతో భారత్​- పాక్ మ్యాచ్​ జరగనుంది. ఈ టోర్నీలో గ్రూప్ దశలో భారత్- పాకిస్థాన్ రెండు సార్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 14, 21 తేదీ (గ్రూప్, సూపర్ 4 దశ)ల్లో భారత్-పాక్ మ్యాచ్ ఆడనుంది. అంతేకాకుండా నాకౌట్ దశలోనూ మరోసారి ఇరుజట్లు పోటీపడే ఛాన్స్​ కూడా ఉంది. ఫలితంగా ఇరు జట్లు మూడు సార్లు ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్​లు అన్నింటికీ దుబాయ్ స్టేడియం వేదిక కానుంది.

ఇవి తప్పక చదవండి

ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ డ్రా ఖరారు

లివర్‌పూల్ జట్టు బార్న్స్లీపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించిన తర్వాత ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ సందడి మొదలైంది. సోమవారం రాత్రి జరిగిన డ్రాలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఖరారయ్యాయి. ఈ రౌండ్‌లో ముఖ్యంగా...

నేటి స్కాటిష్ బడ్జెట్: ఆర్థిక సవాళ్ల మధ్య షోనా రాబిన్సన్ కీలక నిర్ణయాలు

నేడు మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు స్కాటిష్ ఆర్థిక మంత్రి షోనా రాబిన్సన్ హోలీరూడ్ అసెంబ్లీలో 2026-27 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 6,000 కోట్ల పౌండ్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం...

తీవ్ర ఒత్తిడిలో హాస్పిటల్స్: నాలుగు ఎన్.హెచ్.ఎస్ ట్రస్ట్‌లలో ‘క్రిటికల్’ పరిస్థితులు

సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్: చలి తీవ్రత పెరగడం, ఫ్లూ మరియు నోరోవైరస్ కేసులు ఊహించని రీతిలో పెరగడంతో సరీ, కెంట్ మరియు ససెక్స్ ప్రాంతాల్లోని నాలుగు కీలక ఎన్.హెచ్.ఎస్ (NHS) హాస్పిటల్ ట్రస్ట్‌లు...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు