Wednesday, 3 September 2025

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇండియా బాట్స్మన్ చేతేశ్వర్ పుజారా

టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం ప్రటచించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్​లో పోస్ట్ చేశాడు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆస్ట్రేలియాపై పుజారా తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమ్ఇండియా జట్టులో ఆడలేదు.

‘టీమ్ఇండియా జెర్సీ ధరించి, జాతీయ గీతం ఆలపించడం, మైదానంలో దిగిన ప్రతీసారి భారత్ జట్టు కోసం అత్యుత్త ప్రదర్శన ఇవ్వడానికి ట్రై చేయడాన్ని మాటల్లో చెప్పలేను. అది నాకు ఎంతో గౌరవం. కానీ, ప్రతీ దానికి ఓ ముగింపు అనేది ఉంటుంది. అందుకే అపారమైన కృతజ్ఞతతో నేను భారత క్రికెట్​లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’ పుజారా తన పోస్ట్​లో రాసుకొచ్చాడు.

కాగా, 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పుజారా టెస్టుల్లో తనదైన ముద్రవేశాడు. టీమ్ఇండియా తరపున 100 టెస్టు మ్యాచ్​లు ఆడిన అతికొద్ది మంది క్రికెటర్లలో పుజారా ఒకడు. సుదీర్ఘ కాలంలో 103 టెస్టుల్లో పుజారా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. 2023 జూన్​లో పుజారా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక వన్డేల్లో కేవలం 5 మ్యాచ్​ల్లోనే ఆడాడు

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు