టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం ప్రటచించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశాడు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై పుజారా తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమ్ఇండియా జట్టులో ఆడలేదు.
‘టీమ్ఇండియా జెర్సీ ధరించి, జాతీయ గీతం ఆలపించడం, మైదానంలో దిగిన ప్రతీసారి భారత్ జట్టు కోసం అత్యుత్త ప్రదర్శన ఇవ్వడానికి ట్రై చేయడాన్ని మాటల్లో చెప్పలేను. అది నాకు ఎంతో గౌరవం. కానీ, ప్రతీ దానికి ఓ ముగింపు అనేది ఉంటుంది. అందుకే అపారమైన కృతజ్ఞతతో నేను భారత క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’ పుజారా తన పోస్ట్లో రాసుకొచ్చాడు.
కాగా, 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పుజారా టెస్టుల్లో తనదైన ముద్రవేశాడు. టీమ్ఇండియా తరపున 100 టెస్టు మ్యాచ్లు ఆడిన అతికొద్ది మంది క్రికెటర్లలో పుజారా ఒకడు. సుదీర్ఘ కాలంలో 103 టెస్టుల్లో పుజారా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. 2023 జూన్లో పుజారా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక వన్డేల్లో కేవలం 5 మ్యాచ్ల్లోనే ఆడాడు