Thursday, 15 January 2026

ఇండియన్ క్రికెట్ టీం మేనేజర్‌గా తెలుగు వ్యక్తి

భారత క్రికెట్ జట్టులో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యత లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు, భీమవరానికి చెందిన పీవీఆర్ ప్రశాంత్‌ను టీమిండియా మేనేజర్‌గా నియమించారు. త్వరలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు ఆయన భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రశాంత్, గతంలో పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించారు.

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘ‌నిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు హాంకాంగ్, ఒమన్, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి. ఈ కీలక టోర్నమెంట్‌లో జట్టు మేనేజ్‌మెంట్ బాధ్యతలను ప్రశాంత్ పర్యవేక్షించనున్నారు. ప్రశాంత్ రాజకీయంగా కూడా సుపరిచితమైన కుటుంబానికి చెందినవారు. ఆయన భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అయిన పులపర్తి రామాంజనేయులు కుమారుడు. అంతేకాకుండా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు స్వయానా అల్లుడు.

కాగా, భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి ఎంపికవ్వడం ఇది రెండోసారి. గతంలో 1997లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా విశాఖ‌ప‌ట్నం మాజీ మేయర్ డీవీ సుబ్బారావు టీమిండియాకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా సేవలు అందించారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రశాంత్‌కు ఈ అవకాశం దక్కడం విశేషం.

ఇవి తప్పక చదవండి

ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ డ్రా ఖరారు

లివర్‌పూల్ జట్టు బార్న్స్లీపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించిన తర్వాత ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ సందడి మొదలైంది. సోమవారం రాత్రి జరిగిన డ్రాలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఖరారయ్యాయి. ఈ రౌండ్‌లో ముఖ్యంగా...

నేటి స్కాటిష్ బడ్జెట్: ఆర్థిక సవాళ్ల మధ్య షోనా రాబిన్సన్ కీలక నిర్ణయాలు

నేడు మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు స్కాటిష్ ఆర్థిక మంత్రి షోనా రాబిన్సన్ హోలీరూడ్ అసెంబ్లీలో 2026-27 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 6,000 కోట్ల పౌండ్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం...

తీవ్ర ఒత్తిడిలో హాస్పిటల్స్: నాలుగు ఎన్.హెచ్.ఎస్ ట్రస్ట్‌లలో ‘క్రిటికల్’ పరిస్థితులు

సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్: చలి తీవ్రత పెరగడం, ఫ్లూ మరియు నోరోవైరస్ కేసులు ఊహించని రీతిలో పెరగడంతో సరీ, కెంట్ మరియు ససెక్స్ ప్రాంతాల్లోని నాలుగు కీలక ఎన్.హెచ్.ఎస్ (NHS) హాస్పిటల్ ట్రస్ట్‌లు...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు