రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం, రాష్ట్రంలో భాగమైన పోలీసు అధికారులు రాజ్యాంగాన్ని పాటించాల్సిన, దాని ఆదర్శాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని, శుక్రవారం (మార్చి 28) సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
పౌరులు రాజ్యాంగాన్ని పాటించాలని, దాని సంస్థలను గౌరవించాలని ఆదేశించే ఆర్టికల్ 51A(a) గురించి ప్రస్తావిస్తూ, అధికారులు వ్యక్తుల ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా ఆర్టికల్ 19(1)(a) కింద హామీ ఇవ్వబడిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాలని కోర్టు పేర్కొంది.
“ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో” అనే కవిత నేపథ్యంలో వీడియో క్లిప్ను కలిగి ఉన్న తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు సంబంధించి, కాంగ్రెస్ రాజ్యసభ MP ఇమ్రాన్ ప్రతాప్గఢిపై గుజరాత్ పోలీసులు నమోదు చేసిన FIRను కొట్టివేస్తూ, జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం 75 సంవత్సరాలకు పైగా అమలులో ఉన్నప్పటికీ, పోలీసు అధికారులు తమ రాజ్యాంగ బాధ్యతల పట్ల తగినంతగా అవగాహన కలిగి ఉండరని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం తమ బాధ్యతల గురించి, అధికారులు తెలుసుకునేలా భారీ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.
సుప్రీం కోర్ట్ చేసిన పదునైన వ్యాఖ్యల్ని, ప్రభుత్వం, పోలీసులు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారో వేచి చూద్దాం.