Rajiv Gandhi National Institute of Youth and Development (RGNIYD), తమిళనాడు, మే 25, 2025న ముగింపు సంవత్సరంలో Master’s in Social Work చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులను “Free Palestine” “Jai Bheem” అనే గ్రాఫిటీల కారణంగా సస్పెండ్ చేసింది. వారి చర్యలను సంస్థ “anti-national” గా అభివర్ణించి Aslam S, Sayeedh M A, Nahal Ibnu Abullaise ను సస్పెండ్ చేశారు.
వీరు కేరళకు చెందినవారు. గతంలోనే వీరిని హోస్టల్ నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు వార్షిక పరీక్షలకు ఒకరోజు ముందు వీరికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, వారు ఒక సంవత్సరం పాటు ఏవైనా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే అర్హత కోల్పోయారు.
శుక్రవారం రోజునే వారి హాల్ టికెట్లు నిరాకరించబడ్డాయి. శనివారం సాయంత్రం 8 గంటలకే – అది సెలవు రోజు అయినప్పటికీ – వారికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.