అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు సంబంధించి మరో బాంబు పేల్చనున్నారు. ఇప్పటివరకు ఫార్మా రంగం వైపు దృష్టి సారించని ట్రంప్ దిగుమతులపై సుంకాలను విధించడానికి సిద్ధమయ్యారు. ఈ నిర్ణయం అమెరికా ఫార్మాస్యూటికల్ పరిశ్రమను ప్రోత్సహించడం, విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా చేయడం జరిగింది.
2025 ఏప్రిల్ 8న నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ డిన్నర్ ఈవెంట్లో మాట్లాడుతూ ట్రంప్ త్వరలో ఫార్మాస్యూటికల్ దిగుమతులపై “ప్రధాన” సుంకాలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సుంకాల ద్వారా, ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం. డిన్నర్ లో మాట్ర్లాడుతూ ట్రంప్ “మనం ఫార్మా రంగంలో ఉత్పత్తులు చేయం. దిగుమతే చేసుకుంటాం. కొత్త సుంకాలతో ఎగుమతిదారులు అమెరికాలోనే తమ ఉత్పత్తుల్ని తయారుచేయక తప్పదు”అన్నారు.
గ్లోబల్ సుంకాలు: ఇప్పటికే, ఏప్రిల్ 5, 2025 నుండి, అన్ని దేశాల నుండి దిగుమతులపై 10% సుంకాలు అమల్లోకి వచ్చాయి.
ఇండస్ట్రీ ప్రతిస్పందన: యూరోపియన్ యూనియన్ వంటి ప్రాంతాల నుండి, ఈ సుంకాలు ఫార్మాస్యూటికల్ కంపెనీలను అమెరికాకు తరలించడానికి ప్రోత్సహించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
భారతదేశంపై ప్రభావం:
భారతదేశం నుండి అమెరికాకు పెద్ద మొత్తంలో జనరిక్ ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. మనదేశంలో తయారయ్యే దాదాపు 40 జనరిక్ ఔషధాలు అమెరికాకే ఎగుమతి అవుతాయి. 2024 సంవత్సరంలో దాదాపు 900 బిలియన్ డాలర్ల ఎగుమతులు భారత్ నుండి అమెరికాకి ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు పెరిగిన సుంకాల భారం అమెరికా వినియోగదారుల మీద పడుతుంది. ఆ విధంగా ఈ సుంకాలు భారత ఔషధ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు, ఎందుకంటే అమెరికా మార్కెట్లో భారత ఔషధాల ధరలు పెరగవచ్చు, ఇది పోటీ సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.
ట్రంప్ సర్కారు ఫార్మాస్యూటికల్ దిగుమతులపై సుంకాలను విధించడం ద్వారా, అమెరికా లోని ఔషధ తయారీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మార్కెట్లో మార్పులను తెచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా భారతదేశం వంటి ప్రధాన ఔషధ ఎగుమతిదారులపై ఎక్కువగా వుండనున్నది.