రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపుపై సర్కారు వెనక్కి తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాత టారిఫే ఉంటుందని స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పరిపాలన సహా పలు అంశాల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. విద్యుత్తు చార్జీలు పెంచితే అసలుకే మోసం వస్తుందని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాత టారిఫ్నే కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని మంగళవారం ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ భవన్లో నిర్వహించారు. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, జేఎండీ శ్రీనివాసరావు, టీజీఎన్పీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి హాజరయ్యారు. టీజీఎన్పీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ 2025 -26 సంవత్సరంలో చార్జీలు పెంచబోమని ఈ సమావేశంలో ప్రకటించారు.
Previous Articleస్మోక్ బాంబ్స్ తో కలవరపడిన సెర్బియా పార్లమెంట్…..
Next Article అమెరికా సహాయం నిలిపివేతతో దిగివచ్చిన జెలెన్ స్కీ
Add A Comment