కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అంటూ ప్రచారం చేస్తోంది. 15 నెలల్లో రూ.1.63 లక్షల కోట్లు అప్పులు చేయడంలో రైజింగా? అని భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్ పై జరిగిన సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు. “RBI నుంచి బాండ్ల రూపేణా అప్పుతెచ్చుకునేందుకు ప్రభుత్వం మంగళవారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోంది. ప్రభుత్వం ప్రతినిమిషానికి రూ.కోటి చొప్పున రుణం తెస్తోంది. ఇది తెలంగాణ రైజింగ్ కాదు, ఫాలింగ్. కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. బడ్జెట్ లో కేవలం 11.50% మాత్రమే మూలధన వ్యయం ఉంది. అలాంటప్పుడు మీరు చెబుతున్నట్లు సమతౌల్యం ఎక్కడుంది.
ఇవీ అప్పుల వివరాలు (రూ.కోట్లలో)…
2023 డిసెంబరు 7 నుంచి 2024 నవంబరు 30 వరకు తెచ్చిన అప్పులు..
FRBM పరిమితిలో తీసుకున్న అప్పు 52,118. కార్పొరేషన్ల పేర తీసుకున్న రుణాలు 61,991. గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్నది 10,000. మొత్తం అప్పు 1,24,109.
2024 డిసెంబరులో తీసుకున్న అప్పు..
డిసెంబర్ 3న 2,000. డిసెంబర్ 17న 1,500. డిసెంబరు 26న 10,000.
TGIIC ద్వారా..
డిసెంబర్ 31న 409. మొత్తం 13,909.
2025లో తెచ్చిన అప్పులు..
జనవరి 7న 3,000. జనవరి 28న 2,800. ఫిబ్రవరి 4న 3,000. ఫిబ్రవరి 4న 1,000.
TUFIDC కోసం..
మార్చి 5న 2,000. మార్చి 11న 3000. మొత్తం 14,800.