రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ ప్రకటించింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ ప్రకటించింది. 19 ఏండ్లకాల పరిమితికి 6.92శాతం వార్షిక వడ్డీతో రూ.800 కోట్లు, 20 ఏండ్ల కాల పరిమితికి 6.92శాతం వార్షిక వడ్డీతో రూ.700 కోట్లు సమీకరించింది.
2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి రేవంత్ సర్కారు ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగా ఏప్రిల్లో మూడు దఫాల్లో రూ.4,400 కోట్లు, మే నెలలో రెండు దఫాల్లో 4,500 కోట్లు అప్పు తీసుకున్నది. తాజా రుణం రూ.1,500 కోట్లు కలిపి రెండున్నర నెలల్లో రూ.10,400 కోట్లు సమీకరించినట్టయింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.