మొబైల్స్ పై ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో (Telangana) జనాభాకంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయంట. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్-2024) సెప్టెంబర్ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4.19 కోట్లు, మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 4.4 కోట్లు, ల్యాండ్లైన్ వినియోగదారుల సంఖ్య 15.25 లక్షలుగా పేర్కొంది.
కేవలం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య గ్రామాల్లో 39%, పట్టణాల్లో 60%, మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య గ్రామాల్లో 41%, పట్టణాల్లో 59%, ల్యాండ్లైన్ వినియోగదారుల్లో గ్రామాల్లో 4%, పట్టణాల్లో 96%.
రాష్ట్ర Wireless Teledensity 105.32% ఉంది. అంటే సగటున ప్రతి 100 మందికి 105కి పైగా మొబైల్ ఫోన్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ అంశంలో దేశవ్యాప్తంగా తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గోవా-152, కేరళ-115, హర్యానా 114 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుత ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. ఈ తరుణంలో సర్వే ప్రకారం తెలంగాణలో మొబైల్ వాడకం ఎక్కవగా ఉండటం, రాష్ట్ర ప్రజలు కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఎంత ప్రయారిటీని ఇస్తున్నారో తెలుస్తోంది.