Wednesday, 3 September 2025

తెలంగాణ న్యాయవాద దంపతుల హత్య కేసు: సీబీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభం

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు–నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్వీకరించింది. ఇప్పటికే ముగ్గురిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

ఎఫ్‌ఐఆర్‌లో ముగ్గురు నిందితులు: సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లు ఉన్నాయి. దర్యాప్తు అధికారిగా విపిన్ గహలోత్ నియమితులయ్యారు. సీబీఐ ఈ కేసులో అన్ని కోణాలను లోతుగా పరిశీలించనుంది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల సమీపంలో వామనరావు, నాగమణి దంపతులను దుండగులు నడిరోడ్డుపై దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర పోలీసులు విచారణ(Inquiry) జరిపి కొందరు నిందితులను అరెస్టు చేసినప్పటికీ, బాధితుల కుటుంబం దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు గత ఆగస్టు 12న కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సీబీఐ అధికారికంగా కేసు స్వీకరించడంతో దర్యాప్తు మళ్లీ పునఃప్రారంభమైంది.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు