Wednesday, 3 September 2025

జీతం అడిగినందుకు కంపెనీ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చోబెట్టారు

శాల‌రీ అడిగినందుకు కంపెనీ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చొబెట్టార‌ని, రాత్రికి రాత్రే జాబ్ నుంచి తీసేశార‌ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న ఉప్ప‌ల్ పీఎస్ ప‌రిధిలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఉప్ప‌ల్ ఐడీఏలోని ఐటీ పార్కులో ఫ్రూజెస్ ఐటీ స‌ర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నారు. మంగ‌ళ‌వారం నాడు డ్యూటీ ఉన్న స‌మ‌యంలో జులై నెల‌కు సంబంధించిన జీతాలు ఎప్పుడు ఇస్తార‌ని యాజ‌మాన్యాన్ని అడిగిన‌ట్లు వారు తెలిపారు. అంతే.. వెంట‌నే కంపెనీకి పోలీసుల‌ను ర‌ప్పించి 14 మంది ఉద్యోగుల‌ను ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకొచ్చార‌న్నారు.

బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు త‌మ‌ను పీఎస్‌లోనే కూర్చొపెట్టి మ‌నోవేద‌న‌కు గురిచేశార‌ని వారు వాపోయారు. అయితే, ఉద్యోగులు గొడ‌వ చేయ‌డంతోనే కంపెనీ యాజ‌మాన్యం ఫిర్యాదు చేసింద‌ని పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేర‌కే ఉద్యోగుల‌ను పీఎస్‌కు తీసుకొచ్చామ‌న్నారు.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు