Saturday, 21 March 2026

హైదరాబాద్ టూ ఆమ్‌స్టర్‌డామ్.. ఇక డైరెక్ట్ ఫ్లైట్

హైదరాబాద్ నుంచి యూరప్‌కు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్’ హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ నాన్‌స్టాప్ విమాన సర్వీసు వారానికి మూడుసార్లు నడుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కొత్త సర్వీసుతో తెలుగు రాష్ట్రాల నుంచి యూరప్ ప్రయాణం మరింత సులభతరం కానుంది.

భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా కేఎల్‌ఎం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల నుంచి సేవలు అందిస్తుండగా, హైదరాబాద్ తమకు నాలుగో గేట్‌వే అని కేఎల్‌ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నాలుగు నగరాల నుంచి వారానికి 24 విమానాలను ఆమ్‌స్టర్‌డామ్‌కు నడుపుతున్నామని, శీతాకాలంలో ఈ సంఖ్యను 27కి పెంచనున్నట్లు ఆయన వివరించారు.

హైదరాబాద్ నగరం ఫార్మా, ఐటీ రంగాలకు కీలక కేంద్రంగా ఎదుగుతోందని, ఇక్కడి నుంచి సరుకు రవాణాకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మార్టెన్ స్టీనెన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్-ఆమ్‌స్టర్‌డామ్ మార్గంలో బోయింగ్ 777-200ఈఆర్ విమానాలను ఉపయోగిస్తున్నామని, ఇందులో వివిధ తరగతుల్లో కలిపి ఒకేసారి 288 మంది ప్రయాణించవచ్చని కేఎల్‌ఎం అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కనెక్టివిటీ వ్యాపార, పర్యాటక రంగాలకు ఎంతో ఊతమిస్తుందని భావిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు