రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతున్నది. ప్రైవేట్పై మోజుతో సర్కారు స్కూళ్లల్లో చేరేవారు కరువయ్యారు. అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థుల్లో సర్కారు స్కూళ్లపై నమ్మకం సన్నగిల్లుతున్నది. మరీ ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్లు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు చేరకపోవడంతో స్కూళ్లు మూసివేత దిశలో సాగుతున్నాయి. తాజా వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,980 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లున్నాయి.
ఇందులో 1,900 స్కూళ్లు ప్రాథమిక పాఠశాలలే. మరో 40 చొప్పున ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 2020లో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,245 ఉండగా, 2022 వరకు ఈ స్కూళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2023లో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,307కు పెరగగా, 2025కు వచ్చే సరికి 2వేలకు చేరాయి. అంటే ఈ ఏడాదిన్నర కాలంలోనే వెయ్యి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య జీరో అయ్యింది.
రాష్ట్రంలో 18,259 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుండగా వీటిలో 6,94,968 మంది విద్యార్థులున్నారు. అంటే ఒక స్కూళ్లో సగటు విద్యార్థుల సంఖ్య 38 మాత్రమే.
3,143 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలుంటే వీటిలో విద్యార్థుల సంఖ్య 1,91,178గా ఉంది. అంటే ఒక స్కూళ్లో సగటున 60 మంది విద్యార్థులున్నారు.
4,704 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 7,99,589. ఈ లెక్కన సగటున ఒక స్కూళ్లో 169 మంది విద్యార్థులున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,757 ఉండగా, వీటిలో ఏకంగా 37,26,200 మంది విద్యార్థులన్నారు. ఒక ప్రైవేట్ స్కూళ్లో సగటు విద్యార్థుల సంఖ్య 316గా ఉంది.
రాష్ట్రంలో మొత్తం 60లక్షలకు పైగా విద్యార్థులుండగా, కేవలం 11వేలకు పైగా ప్రైవేట్ స్కూళ్లల్లో 37లక్షలకు (61శాతం)పైగా విద్యార్థులున్నారు.