మరోసారి 10వ తరగతి పేపర్ లీక్! కామారెడ్డి జిల్లా జుక్కల్ జడ్పీ హైస్కూల్ లో బుధవారం మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ లోని కొన్ని ప్రశ్నలు పేపర్పై రాసి బయటకు పంపిన ఘటనపై అధికారులు ఎంక్వెరీ ప్రారంభించారు. ప్రాథమిక విచారణ అనంతరం సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ ఎం.సునీల్ (స్కూల్ అసిస్టెంట్, డొంగ్లి), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వి.భీమ్ (స్కూల్ అసిస్టెంట్, మద్నూర్), ఇన్విజిలేటర్ సోమూర్ను సస్పెన్షన్ చేసినట్లు DEO రాజు తెలిపారు.
జుక్కల్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్న ఓ విద్యార్థి పేపర్ పై ప్రశ్నలు రాసి బయటకు పంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు సమాచారం. విషయం తెలియడంతో కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ ఎంక్వైరీకి ఆదేశించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, DEO రాజు, ఇతర అధికారులు జుక్కల్ వెళ్లి విచారణ చేపట్టారు. సీఎస్, డీవో, ఇన్విజిలేటర్లు, స్టూడెంట్స్ తో మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
మార్చి 21న, నల్గొండ జిల్లా నక్రేకల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల (పరీక్షా కేంద్రం) గోడ ఎక్కి, ఒక మైనర్ బాలుడు తన మొబైల్ ఫోన్ ఉపయోగించి ఒక విద్యార్థిని నుండి ప్రశ్నాపత్రం ఫోటో తీశాడు. ఆ బాలిక ప్రశ్నాపత్రాన్ని అతనికి చూపించినప్పుడు అతను కిటికీ దగ్గర నిలబడి ఫోటో తీశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ విద్యార్థినిని డిబార్ చేశారు.
ఆ తర్వాత ప్రశ్నాపత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఇతర నిందితులకు పంపిణీ చేశారు. ఆ ప్రైవేట్ టీచర్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసి, ఇతర నిందితులకు తిరిగి పంపారు. వారు ఫోటోకాపీ సెంటర్ నుండి సమాధానాల ప్రింట్ అవుట్లను తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లాలో 10వ తరగతి (SSC) బోర్డు పరీక్ష తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిన కేసులో మంగళవారం పోలీసులు మాట్లాడుతూ.. అరెస్టు అయిన వారిలో ఒక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఫోటోకాపీ సెంటర్ యజమాని ఉన్నారని నల్గొండ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) K.శివరాం రెడ్డి తెలిపారు.