Tuesday, 17 March 2026

హైడ్రా వాహనాలకు ఆ అసహజ రంగులెందుకు మీరేమైనా యుద్ధానికి వెళుతున్నారా? హై కోర్ట్

ప్రభుత్వ స్థలాల పరిరక్షణ నేపథ్యంలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు… చర్యలు తీసుకునే సమయంలో హడావుడి లేకుండా నెమ్మదిగా పనిచేసుకోలేరా అంటూ బుధవారం హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. ‘ఎలా పడితే అలా వెళతారా? హైడ్రా వాహనాలకు ఆ అసహజ రంగులెందుకు? మీరేమైనా యుద్ధానికి వెళుతున్నారా’ అని నిలదీసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో తమ్మిడిగుంట ఎఫ్ఎఎల్ పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలంలో చెరువు పునరుద్ధరణ పనులపై యథాతథస్థితి కొనసాగించాలన్న ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా పనులు కొనసాగించడాన్ని సవాలు చేస్తూ ఎస్.వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్తో పాటు, రిట్ పిటిషన్ పై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.

ఇరుపక్షాలు యథాతథస్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణకు పాలడ్పిందని పిటిషనర్ న్యాయవాది తరుణ్ జి. రెడ్డి వివరించారు. పిటిషనర్కు చెందిన స్థలం 6 ఎకరాల్లో ఎలాంటి పనులు చేపట్టబోమని, మిగిలిన ప్రాంతంలో పనులు చేపట్టడానికి అనుమతించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. “కోర్టు ఉత్తర్వుల అమలుపై అధికారులకు లెక్క లేదు. ఏదో ఒక రోజు కోర్టు ఉత్తర్వులంటే ఏమిటో రుచి చూపిస్తాం. కోర్టుకు ఉన్న అధికారం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. హైడ్రా కమిషనర్కు కూడా కోర్టు ఉత్తర్వుల ప్రాధాన్యం తెలుసు” అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

“ఎఫ్ఎఎల్ పరిధిలో నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. ఎఫ్ఎఎల్కు సంబంధించి ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాకాకుండా ఎన్నేళ్లు ఇలా వివాదాలతో కొనసాగిస్తారు? ఒకవేళ ఎల్టీటీఎల్లో ప్రైవేటు పట్టా భూమి ఉంటే భూసేకరణ చట్టం ద్వారా సేకరించాలి. అలా చేస్తే వివాదాలకు తెరపడుతుంది” అని న్యాయస్థానం సూచించింది.
విచారణ సోమవారానికి వాయిదా పడింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు