Saturday, 21 March 2026

ఖ‌జానా జ్యువెల‌రీ చోరీ కేసు.. ముగ్గురు నిందితుల అరెస్టు

హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్‌ ఖ‌జానా జ్యువెల‌రీలో చోరీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. పుణెలో ఒక‌రిని, బీద‌ర్‌లో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు బిహార్‌కు చెందిన‌వార‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈనెల 12వ తేదీన చందాన‌గ‌ర్ ఖ‌జానా జ్యువెల‌రీలో దుండ‌గులు దోపిడీకి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. జ్యువెల‌రీలోని ఉద్యోగిపై కాల్పులు జ‌రిపిన దొంగ‌ల ముఠా చోరీ చేసి ప‌రారైంది.

నెల రోజుల క్రితం బిహార్ నుంచి న‌గ‌రానికి వ‌చ్చిన దొంగ‌ల ముఠా జ‌గ‌ద్గిరి గుట్ట‌లో మ‌కాం వేశారు. అక్క‌డ ఓ గ్లాసు ప‌రిశ్ర‌మ‌లో ప‌నికి కుదిరారు. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఈ నెల 12న ఆయుధాల‌తో వెళ్లి, జ్యువెల‌రీ సిబ్బందిని బెదిరించి చోరీ చేసిన అనంత‌రం ప‌రార‌య్యారు. ఈ దోపిడీ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. బృందాలుగా ఏర్ప‌డి నిందితుల కోసం గాలించారు. ఈ క్ర‌మంలో తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు