రాజకీయ పార్టీలు, నాయకులు అధికారానికి మాత్రమే బద్దులు మిగతావి అన్ని అవకాశం వచ్చినట్లు వాడుకుంటారు. అందుకు ఏ పార్టి నాయకుడు మినహాయింపు కాదు. వాళ్ళు తెలివిగా గుంపు ఎక్కువగా దేని గురించి స్పందిస్తే గుంపు ఎటు వైపు మొగ్గు చూపితే అటువైపు నడుస్తారు. వాళ్ళు ఏ పార్టి నాయకుడిని అయినా తమ పార్టీలో చేర్చుకుంటారు. ఏ పార్టీని అయినా తమ పార్టీలో కలుపుకుంటారు. ఏ పార్టీతో అయినా సరే పొత్తుపెట్టుకుంటారు. మీరు గమనించండి ముఖ్యమైన పార్టీలు అన్ని ఒకరిని ఒకరు తిట్టుకొని తన్నుకొని తిరిగి కలిసి పోటీ చేస్తాయి అడిగితె దేశం కొరకు అంటారు లేదా రాష్ట్రము కొరకు అంటారు.
గత కొంత కాలంగా దేశంలో బీజేపీ ఎక్కువ అధికారంలో ఉంది రాష్ట్రాల్లోనూ అధికారం లో ఉంది అందుకే బీజేపీ ని చూద్దాం. కరుడుకట్టిన కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ను బీజేపీ లో చేర్చుకుంది. జమ్మూ కాశ్మీర్ లో మెహబూబా ముఫ్తి పార్టీతో పొత్తుపెట్టుకొని అధికారం నడిపించింది. ఆంధ్రాలో బాబు 2019 లో బీజేపీ ఎన్ని మాటలు అన్నాడు తిరిగి పొత్తుపెట్టుకొని పొగుడుకుంటున్నారు.
ఓ ఆరు నెలల కింద జనాభా గణన కుల గణన గురించి బీజేపీ నాయకులు ఎం మాట్లాడారు? మెల్లగా ప్రజల్లో టోన్ అటువైపు ఉన్నట్లు ఉంది అని గమనించి మాట మార్చి ఇప్పుడు కులగణన చేస్తాం అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ దాడుల తరువాత మీడియా ముందు మాట్లాడటానికి పెట్టిన వాళ్ళను గమనిస్తే ఏం అర్థం అవుతుంది. ఇలా ఎన్నో ఎన్నో చేస్తుంటారు. దేని కోసం కార్యకర్తల కోసం ప్రజల కోసమా? కాదు అధికారం కోసం మాత్రమే వాళ్ళ అన్ని రకాల ప్రయత్నాలు తరువాతే కార్యకర్తలు ప్రజలు అభిమానులు. కొంచెం అలోచించి బుర్రకు పదును పెడితే అర్థం అవుతాయి.
రాజకీయ పార్టీలకు నాయకులకు సపోర్ట్ చేయండి అయితే కొంచెం విచక్షణ ఉపయోగించండి. వాళ్లకు బలంగా మారకండి. వాళ్ళేం చేసినా అది కరక్ట్ అనే మూర్ఖపు వాదనను తెర మీదికి తీసుకురాకండి. అదే పనిగా ఒకే పార్టీని ద్వేషించకండి. అన్ని పార్టీలు మంచి చేస్తాయి చెడు చేస్తాయి అవేంటో గమనించండి. బీజేపీ హవా నడుస్తుంది కాబట్టి బీజేపీని ప్రస్తావించడం జరిగింది. మిగతా వాళ్ళు అంతా ఆ మ్రాను మొక్కలే.