మావోయిస్టులకు మరో ఎదురదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి (Maredumilli) అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ (Uday), జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ (Aruna) ఉన్నారు. మరో మావోయిస్టు అంజుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ ఘటనాస్థలి నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Add A Comment